Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా ఫ్యామిలీ మా గురువుగారి వెంటే : సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej
, బుధవారం, 2 ఆగస్టు 2023 (09:22 IST)
పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. గత నెల 28వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతుంది. మరోవైపు, ఈ చిత్ర విజయోత్సవ యాత్రలో చిత్ర బృందం నిమగ్నమైవుంది. ఇందులోభాగంగా, చిత్ర బృందం మంగళవారం శ్రీనగర్‌ కాలనీలోని ఓ హోటల్‌కు వచ్చింది. ఈ సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌ విలేకర్లతో మాట్లాడుతూ మామయ్య పక్కన నటించడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. 
 
బ్రో చిత్రం కథ వినగానే ఎప్పుడెప్పుడు చేస్తానోనని ఆత్రుతగా ఎదురు చూశానని, చిరంజీవి మామయ్యతో నటించేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని తెలిపారు. మల్టీస్టార్‌ చిత్రాల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనన్నారు. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. 
 
'స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక లఘు చిత్రం చేశా. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంత్రి అంబటి రాంబాబుపై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్‌ తీయలేదు. సినిమా, రాజకీయాలను వేర్వేరుగా చూడండి. నాకు రాజకీయ అనుభవం లేదు. మా కుటుంబ సభ్యులంతా పవన్‌ కల్యాణ్‌తోనే ఉంటాం' అని స్పష్టం చేశారు.
 
'బ్రో' చిత్రంలో నా క్యారెక్టర్‌ చనిపోయినప్పుడు భ్రమతో మూడు గంటలు ఏడ్చా.. పవన్‌ మామయ్యకు దూరమై పోతున్నాననే బాధతో. కానీ మేమంతా పవన్‌ కల్యాణ్‌తోనే జీవితాంతం ఉంటాం'అని చెప్పారు.
 
ఆ తర్వాత చిత్ర దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ, నటించడం కంటే దర్శకుడిగా రాణించడమే చాలా ఇష్టమన్నారు. గత 16 ఏళ్లుగా దర్శకత్వం చేస్తున్నానని, పవన్‌తో అందరూ సినిమాలు తీయాలనుకుంటున్నా వారికి సాధ్యపడలేదన్నారు. కానీ, తన టైం వచ్చిందని, అందుకే అలాంటి స్టార్‌ను డైరెక్ట్ చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. 
 
పవన్‌ కల్యాణ్‌తో 10 నిమిషాలు మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం అర్థమవుతుందన్నారు. ఈ చిత్రం తీసేందుకు సాయి ధరమ్‌తేజ్‌ ఆరోగ్యం కోలుకొని త్వరగా రావాలని రెండేళ్లు ఎదురు చూశానని సముద్రఖని వెల్లడించారు. ఆ నిరీక్షణకు ఫలితం దక్కిందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీ థియేటర్ 'సచ్ కహూన్ తో' ఇప్పుడు ఆంధ్రప్రదేశ్- తెలంగాణా వీక్షకుల కోసం తెలుగులో ప్రసారం