Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యూ కడుతున్న నిర్మాతలు... ఒక్కసారిగా పెంచేసిన పాయల్ (video)

క్యూ కడుతున్న నిర్మాతలు... ఒక్కసారిగా పెంచేసిన పాయల్ (video)
, సోమవారం, 27 మే 2019 (12:18 IST)
"ఆర్ఎక్స్ 100" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్. ఈ ఒక్క చిత్రంతోనే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. గ్లామర్ పరంగా యూత్ హృదయాలను కొల్లగొట్టింది. ఇటు తెలుగు తమిళ భాషల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తన మాతృభాష పంజాబీలోనూ ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తన పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. 
 
ప్రస్తుంత తెలుగులో అక్కినేని నాగార్జున నటిస్తున్న "మన్మథుడు-2", విక్టరీ వెంకటేష్ నటిస్తున్న "వెంకీమామ", రవితేజా నటించే "డిస్కోరాజా" చిత్రాల్లో పాయల్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు యువరత్న బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం నిర్మాత సి.కళ్యాణ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
బాలకృష్ణ చిత్రం కోసం ఆమె రూ.75 లక్షల నుంచి రూ.కోటి మేరకు డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే, ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై చిత్ర దర్శకనిర్మాతలు తర్జనభర్జనలు చెందుతున్నారట. అయితే, పాయల్‌కు అటు మాస్, ఇటు యూత్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆమె డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇంత‌కీ.. పూరికి విజ‌యం వ‌చ్చేనా.?