Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ దెబ్బకు చెగువేరా సమాధిలోనే తన్మయత్వంతో సంబరం చేస్కుంటాడు...

ఈమధ్య కాలంలో రాంగోపాల్ వర్మ ప్రత్యేకించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన దృష్టి సారించినట్లు అగుపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఏదయినా ట్వీట్ చేస్తే చాలు... వెంటనే వర్మ రీట్వీటులు చేస్తున్నారు. తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా

పవన్ దెబ్బకు చెగువేరా సమాధిలోనే తన్మయత్వంతో సంబరం చేస్కుంటాడు...
, మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (13:00 IST)
ఈమధ్య కాలంలో రాంగోపాల్ వర్మ ప్రత్యేకించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన దృష్టి సారించినట్లు అగుపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఏదయినా ట్వీట్ చేస్తే చాలు... వెంటనే వర్మ రీట్వీటులు చేస్తున్నారు. తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా ఇలా సెటైర్లు వేశాడు. చెగువేరా ఫ్యాన్ పవన్ చేసే ట్వీట్లను చదివేసిన తర్వాత చెగువేరా సమాధిలో తన్మయత్వంతో సంబరపడిపోతాడు. 
 
పవన్ ఏదయినా అర్థం చేసుకున్నాడంటే ఆయనలోని ఫైర్ బయటకు వస్తుందంటూ కామెంట్ చేశాడు. కనుకనే చెగువేరా కూడా పవన్ కారణంగా తన సమాధిలో ప్రశాంతంగా ఉండలేడనీ, దీనికి కారణం.. చెగువేరా-పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఆవేశంగా ఫైర్ అవుతారని పేర్కొన్నాడు. వర్మ కామెంట్ల వెనుక ఓ కారణం వుందంటున్నారు. అదేంటయా అంటే... బీజేపీ నేత తరుణ్ విజయ్ దక్షిణాదివారిని నల్లవాళ్ళని చేసిన కామెంట్లేనని అనుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ సినిమాలో అనసూయ.. ఐటమ్ సాంగ్ చేస్తుందా? లేకుంటే..?