Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

Advertiesment
pawan family

వరుణ్

, బుధవారం, 26 జూన్ 2024 (08:39 IST)
సినీ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ శాపనార్థాలు పెట్టారు. తనను, తన పిల్లలు ఆద్య, అకీరా నందన్‌లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో చేస్తున్న కామెంట్స్, ట్రోల్స్‌, మీమ్స్‌పై ఆమె మండిపడ్డారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని ఆమె శాపనార్థాలు పెట్టారు. అయినప్పటికీ వ్యంగమైన పోస్ట్‌లు ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇటీవలే భార్య అన్నా లెజినోవాతో అకీరా నందన్, ఆద్యలతో కలిసి పవన్ కళ్యాణ్ ఫొటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైగా, ఈ ఫోటో ఎంతూ చూడముచ్చటగా ఉంది. ఇప్పుడు సదరు ఫొటోపై కూడా కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ వేశారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని రేణూ దేశాయ్ మండిపడ్డారు. 
 
"మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్‍స్టాగ్రామ్‍‌లో రేణు పోస్ట్ పెట్టారు. తన గురించి ఇష్టమొచ్చినట్టుగా రాసిన కామెంట్లు, మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను వారి ఫొటోను ఎలా క్రాప్ చేస్తానో.. ఎలా పోస్ట్ చేస్తానో అంటూ.. మీమ్స్ వేసిన‌ వారందరికీ కూడా ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోండి. ఆద్య నన్ను ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి మీ ఇళ్లలోనూ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఉన్నారని గుర్తుంచుకోండి. 
 
మాపై అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేసున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుంది. నా బిడ్డ ఈరోజు అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో మీకు చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పోలెనా, మార్క్ కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు. మీమ్ పేజ్ అడ్మిన్‌లకు ఈ తల్లి శాపం తగులుతుంది. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100సార్లు ఆలోచించాను. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది' అని రేణు దేశాయ్ తన ఇన్‍స్టా  పోస్ట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల