Rashmika Mandanna, Dixit Shetty
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ చేశారు. 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ ను ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. ఫీల్ గుడ్ లవ్ సాంగ్ గా 'ఏం జరుగుతోంది...' రూపొందించారు. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.