క్రిష్... నీ కోసం నా ట్విట్టర్ ప్రొఫైల్ పేరు మార్చుకున్నా: రానా దగ్గుబాటి
'గౌతమిపుత్ర శాతకర్ణి'పై వస్తున్న వార్తల గురించి తాను వింటున్నానని, ఇక సినిమా చూడకుండా ఆగలేనని హీరో దగ్గుబాటి రానా వ్యాఖ్యానించాడు. 40 నిమిషాల క్రితం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, దర్శకుడు క్రిష
'గౌతమిపుత్ర శాతకర్ణి'పై వస్తున్న వార్తల గురించి తాను వింటున్నానని, ఇక సినిమా చూడకుండా ఆగలేనని హీరో దగ్గుబాటి రానా వ్యాఖ్యానించాడు. 40 నిమిషాల క్రితం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, దర్శకుడు క్రిష్ కు గౌరవంగా తన ప్రొఫైల్ నేమ్ను 'లక్ష్మీపుత్ర రానా'గా మార్చుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు రానా ట్విట్టర్ ఖాతాలో పేరును సవరించుకున్నాడు. కాగా, రానా నటించిన 'ఘాజీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రైలర్ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది.
కాగా, దగ్గుబాటి హీరో రానా హీరోగా నటించిన కొత్త చిత్రం "ఘాజి". 1971లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సంకల్ప్ తెరకెక్కించాడు. ఇందులో తాప్సీ హీరోయిన్గా నటించింది. అతుల్ కులకర్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదల చేశారు.
వ్యూహాలు.. ఎదురుదాడులు.. దేశభక్తితో అడుగుముందుకు వేసిన వైనం వంటి దృశ్యాలతో ఈ ట్రైలర్ను తీశారు. 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ సబ్ మెరైన్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్తో అంచనాలు స్కైన్ టచ్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.