Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌హేష్‌కి టార్గెట్ సెట్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ "భ‌ర‌త్ అనే నేను". బ్లాక్ బ‌స్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఆడియో ఆల్రెడీ విజ‌యం సాం

మ‌హేష్‌కి టార్గెట్ సెట్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌..!
, శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (10:10 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ "భ‌ర‌త్ అనే నేను". బ్లాక్ బ‌స్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఆడియో ఆల్రెడీ విజ‌యం సాంధించ‌డంతో సినిమా పై మ‌రింత క్రేజ్ పెరిగింది. అయితే... రికార్డుల గురించి అంత‌గా ప‌ట్టించుకోని మ‌హేష్ బాబు ఈ సినిమా అంద‌ర్నీ ఆక‌ట్టుకోవాలి అనే ఉద్దేశ్యంతోనే సినిమా చేశాడు త‌ప్ప మైండ్‌లో మ‌రో ఆలోచ‌న పెట్టుకోలేదు.
 
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ "రంగ‌స్థ‌లం" ఇటీవ‌ల రిలీజై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా 3 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.100 కోట్ల షేర్‌కి, రూ.150 కోట్ల గ్రాస్‌కి చేరువలో ఉంది. దీంతో చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం మ‌హేష్‌కి టార్గెట్ సెట్ చేసిన‌ట్టు అయ్యింది. ఇప్పుడు మ‌హేష్ ముందున్న టార్గెట్ ఇదే. 'భ‌ర‌త్ అనే నేను' సెన్సేష‌న్ క్రియేట్ చేసి 'రంగ‌స్థ‌లం' రికార్డ్‌ను క్రాస్ చేయాలి.

దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. రిలీజ్‌కి ముందే మ‌హేష్ త‌న టీమ్‌కి స్పెష‌ల్ గిఫ్ట్స్ ఇవ్వ‌డం... జ‌న‌ర‌ల్‌గా రిలీజ్ త‌ర్వాత ఫ్యామిలీతో టూర్‌కి వెళ్లే మ‌హేష్ ముందుగానే ఫ్యామిలీతో క‌లిసి టూర్‌కి వెళ్ల‌డం బ‌ట్టి సినిమా విజ‌యంపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్ధం చేసుకోవ‌చ్చు. మ‌రి.. చ‌ర‌ణ్ సెట్ చేసిన టార్గెట్‌ని మ‌హేష్ క్రాస్ చేస్తాడో లేదో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగస్థలం సక్సెస్ మీట్‌కు పవన్.. సమంత కూడా వస్తుందా?