Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి 4 యేళ్లు పట్టింది : రామ్ చరణ్

'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని హీరో రామ్ చరణ్ అన్నారు. అంటే... అల్లు నిర్మాత అల్లు అరవింద్, తన కలయికకు ఇంత సమయం పట్టిందని తెలిపారు. ధృవ చిత్రం సక్సెస్‌ మీట్‌లో

Advertiesment
Ram Charan's Dhruva Movie
, ఆదివారం, 25 డిశెంబరు 2016 (13:47 IST)
'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని హీరో రామ్ చరణ్ అన్నారు. అంటే... అల్లు నిర్మాత అల్లు అరవింద్, తన కలయికకు ఇంత సమయం పట్టిందని తెలిపారు. ధృవ చిత్రం సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ... ధృవ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించడం పెద్ద ఎసెట్ అయింది. నేను, మామ అల్లు అరవింద్ కలిసి సినిమా చేస్తే మా కన్నా ఎక్కువ సంతోషించేది మా అమ్మగారే. ఆమె ఆనందం కోసం సినిమా పెద్ద హిట్ కావడం ఆనందాన్ని కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
నటుడిగా నాకు మంచి పేరుతెచ్చిట్టిన చిత్రమిది. నాన్న సినిమా చూసి మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసని ఎప్పటికి మర్చిపోను. పరేషాన్ పాటలో రకుల్‌ని చూసి అభిమానులు చొక్కాలు చించుకున్నారు. నేను నంబర్స్‌ని పట్టించుకోను. వాటిని పట్టించుకుంటే కొత్త కథలు చేయలేను. అలాగే రికార్డుల గురించి కూడా పట్టించుకోనని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ చైతన్య - సమంత నిశ్చితార్థ తేదీ ఖరారు... ఎపుడో తెలుసా?