Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యేడాదిగా దూరంగా ఉంటున్నాం.. విడాకులు కావాలి : సౌందర్య రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ కోర్టును ఆశ్రయించారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఆమె మద్రాసు కుటుంబ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఒక యేడాది కాలంగా తన భర్త, తాను

Advertiesment
Rajinikanth's daughter Soundarya
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (15:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ కోర్టును ఆశ్రయించారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఆమె మద్రాసు కుటుంబ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఒక యేడాది కాలంగా తన భర్త, తాను దూరంగా ఉంటున్నామని అందులో ఆమె పేర్కొన్నారు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అశ్విన్‌తో సౌందర్యకు 2010లో వివాహమైంది. వీరికి యేడాది బాబు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనిపై కొన్ని రోజుల తర్వాత సౌందర్య పెదవి విప్పారు. తాము విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని, ఏడాదిగా దూరంగా ఉంటున్నామని తెలిపారు. 
 
అందువల్ల భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, కొచ్చడియాన్ గ్రాఫిక్ చిత్రానికి ఈమె దర్శకురాలిగా కూడా పని చేశారు. పైగా, గ్రాఫిక్‌ డిజైనింగ్‌లోనూ మంచి ప్రావీణ్యం ఈమె సొంతం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘మీరంతా గర్వించేలా.. 'ఇదిరా! చిరంజీవి' అనేలా 'ఖైదీ' ఉంటుంది : చిరంజీవి