Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విడాకులు కోరుతున్న రజినీకాంత్ కుమార్తె సౌందర్య? కిడ్నీ ఆపరేషన్ కోసం యుఎస్ వెళ్లిన భర్త?

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తెల్లో ఒకరు సౌందర్య. ఈమె దర్శకురాలు కూడా. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్విన్‌ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వివాహం ఆరేళ్ళ క్రితం జరిగింది. అయి

విడాకులు కోరుతున్న రజినీకాంత్ కుమార్తె సౌందర్య? కిడ్నీ ఆపరేషన్ కోసం యుఎస్ వెళ్లిన భర్త?
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (15:52 IST)
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తెల్లో ఒకరు సౌందర్య. ఈమె దర్శకురాలు కూడా. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్విన్‌ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వివాహం ఆరేళ్ళ క్రితం జరిగింది. అయితే, గత కొన్ని రోజులుగా వీరిరువురి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు సమాచారం. 
 
ఈనేపథ్యంలో విడాకులు కోరుతూ ఆమె చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. ఆమె విడాకులు కోరడానికి మరో కారణం లేకపోలేదు. అశ్విన్ కుమార్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ, ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లివున్నారు. ఈ కారణంగానే ఆమె విడాకులు కోరినట్టు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ఈ వ్యవహారం రజినీకాంత్‌కు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. వృత్తిపరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇద్దరు కుమార్తెల కారణంగా రజినీకాంత్ నిత్యం వార్తలకెక్కాల్సి వస్తోంది. మరో కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనతా గ్యారేజ్‌పై కోట శ్రీనివాస్ సెన్సేషనల్ కామెంట్స్.. తెలుగోడికి ప్రాముఖ్యత లేదు..