Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇప్పుడు నా దృష్టి మొత్తం దానిపైనేనంటున్న రాజమౌళి

ఇప్పుడు నా దృష్టి మొత్తం దానిపైనేనంటున్న రాజమౌళి
, బుధవారం, 6 మే 2020 (22:24 IST)
దర్సకధీర రాజమౌళి లాక్ డౌన్ సమయంలో ఏదో పెద్ద ప్రాజెక్టే ప్లాన్ చేస్తుంటారని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉంటే మంచి ప్రాజెక్టును ఎంచుకోవడం.. ఆ సినిమాను భారీ విజయంవైపు తీసుకెళ్ళడం రాజమౌళికి ఉన్న అలవాటు. ఆయన ఏ సినిమా చేసినా అది సూపర్ డూపర్ హిట్టే. 
 
అందుకే రాజమౌళిని దర్సకధీరుడని తెలుగు సినీపరిశ్రమలో పొగుడుతుంటారు. ఈ మధ్య మీడియా ముందుకు వచ్చిన రాజమౌళి లాక్ డౌన్ సమయంలో జనం ఇళ్ళలోనే ఉండాలని కోరారు. తాను ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. సినిమాపైనే దృష్టి పెట్టానని స్పష్టం చేశారు.
 
కానీ ఇన్‌స్టాగ్రాం ద్వారా రాజమౌళికి ఒకటే సందేశాలు పోతున్నాయట. మీలాంటి వారు రామాయణం లాంటి కథను తీసుకుని సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఒకటే సందేశాలను పంపిస్తున్నారట. దీంతో రాజమౌళి అభిమానుల కోసం ఒక సందేశం తాజాగా పంపాడట. రామాయణం కన్నా నాకు మహాభారతం చేయాలన్న కోరిక ఉంది. 
 
కానీ ఆ ప్రాజెక్టు ఇప్పుడు కాదు. ఆషామాషీగా చేసే ప్రాజెక్టు కాదది. ఇప్పుడు నాకు ఆర్.ఆర్.ఆర్.సినిమా ఎలా పూర్తి చేయాలా అన్న దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టాను. ఆ సినిమా గురించే నా ఆలోచన అంతా అంటున్నారట రాజమౌళి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్య, బోయపాటి మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్