Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెండి తెర‌పై పి.వి.నరసింహరావు బయోపిక్

వెండి తెర‌పై పి.వి.నరసింహరావు బయోపిక్
, సోమవారం, 28 జూన్ 2021 (10:17 IST)
PV- Davala sathyam
ఈరోజు అన‌గా జూన్ 28, సోమ‌వారంనాడు పి.పి. జ‌యంతి. ఈరోజే హైద‌రాబాద్‌లో టేంక్‌బండ్‌పైన ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి పి.పి. విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తున్నారు. ఇక ఈరోజే పి.వి.పై సినిమా తీయ‌డానికి ఓ నిర్మాత ముందుకు వ‌చ్చాడు.
 
బహుభాషా కోవిదుడు, అసాధారణ ప్రజ్ఞా దురీణుడు, స్వర్గీయ భారత ప్రధానమంత్రి పి.వి. నరసింహరావు బయోపిక్ 'ఎన్టీఆర్ ఫిల్మ్స్" పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ లో రూపొందిం చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఈయన ఇంతకుముందు శ్రీహరితో "శ్రీశైలం" చిత్రాన్ని నిర్మించారు. 
 
పలు సూపర్ హిట్ చిత్రాల రూపకర్త, ప్రముఖ సీనియర్ దర్శకుడు ధవళ సత్యం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు-హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ బయోపిక్ లోజాతీయస్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడు పి.వి.నరసింహరావు పాత్రను పోషించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటూ అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022, జూన్ 28న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్యం.. నేడు నేత్ర చికిత్స