బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ ఆదివారం గ్రాండ్ ప్రీమియర్కు సిద్ధమవుతోంది. అక్కినేని నాగార్జున ఈ షోకి హోస్ట్గా తిరిగి వస్తున్నారు. తొలిసారిగా, బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొంటారు. షో నిర్వాహకులు బిగ్ బాస్ తెలుగు 9 అగ్నిపరీక్షను సృష్టించారు.
వారు ఆ షో నుండి సామాన్యులను ఖరారు చేయనున్నారు. పుష్ప-2 కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఆమె జానీ మాస్టర్కి అసిస్టెంట్గా పనిచేసింది. ఆమె అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీని ఫలితంగా 2024లో ఆయన అరెస్టుకు గురయ్యారు. ఆమె ఉత్తరప్రదేశ్కు చెందినది. ఆమె వయస్సు 23. బిగ్ బాస్ ఇంట్లో సృష్టి వర్మ పాల్గొనడం అధికారికంగా ధృవీకరించబడలేదు.
ఈ నేపథ్యంలోనే కొందరు సెలబ్రెటీలను బిగ్బాస్ హౌజ్లోకి తీసుకొస్తున్నారు. వీరిలో ప్రభాస్ హీరోయిన్తో పాటు మెగా ఫ్యామిలీ ఆప్తుడు కూడా ఉన్నారు. సీరియల్ యాక్టర్, మెగా ఫ్యామిలీకి ఆప్తుడైన భరణి కుమార్ బిగ్బాస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
హీరోయిన్ ఆషా షైనీ, రాము రాథోడ్, సంజనా గర్లానీ, సృష్టి వర్మ, కమెడియన్ ఇమ్మాన్యుయేల్లతో పాటు 7/G బృందావన కాలనీ, జయం ఫేమ్ సుమన్ శెట్టి కూడా బిగ్బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. సోషల్ మీడియాలో బూతులతో ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ పాప కూడా బిగ్బాస్ హౌజ్లోకి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే వీరితో పాటు ముద్దమందారం ఫేమ్ తనూజ గౌడ కూడా బిగ్బాస్లోకి వస్తుందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. శుభం, కల్కీ మూవీ ఫేమ్ హర్షిత్ రెడ్డి కూడా వెళ్తాడనే వార్తలు వినిపించాయి కానీ అతను వెళ్లట్లేదట. కామనర్స్లో కూడా శ్రీజ, పవన్ కళ్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీశ్, మనీష్ వెళ్తారనే బజ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ 9పై భారీ హైప్ క్రియేట్ అయింది.