Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ బయోపిక్ తీస్తానంటున్న పూరీ జగన్నాథ్...

జగన్ బయోపిక్ తీస్తానంటున్న పూరీ జగన్నాథ్...
, గురువారం, 30 మే 2019 (15:36 IST)
వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో అతడి బయోపిక్ తీయడానికి పలువురు పోటీ పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కొంతమంది జగన్ పేరు ఎత్తడానికి కూడా భయపడ్డారు.


అయితే మరికొంతమంది నటీనటులు మాత్రం ధైర్యంగా జగన్‌కు అండగా నిలిచారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రి కావడంతో జగన్ బయోపిక్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది.
 
తాజాగా మహి వి రాఘవ యాత్ర 2 అంటూ జగన్ బయోపిక్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించగా దర్శకులు పూరి జగన్నాథ్ కూడా నేను సైతం అంటూ ముందుకు వస్తున్నాడు. పూరీ మాత్రం జగన్ బయోపిక్ నేనే తీస్తాను అంటున్నాడు. 
 
గతకొంత కాలంగా ఈ దర్శకుడికి సరైన హిట్ లేదు. దాంతో ఫామ్‌లో లేకుండా పోయాడు. తాజాగా హీరో రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. అది వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. అది సక్సెస్ అయితే జగన్ బయోపిక్ తీస్తానంటే గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాలే కాదు.. అలాంటి సినిమాలు కూడా వద్దు.. అజిత్