Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వచ్చిందా.. ఆస్పత్రికెళ్లి రూ.లక్షలు తగలెయ్యొద్దు.. ఇలా చేయండి.. బండ్ల గణేష్

కరోనా వచ్చిందా.. ఆస్పత్రికెళ్లి రూ.లక్షలు తగలెయ్యొద్దు.. ఇలా చేయండి.. బండ్ల గణేష్
, శుక్రవారం, 10 జులై 2020 (07:29 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో కరోనా వైరస్ బారినపడిన తొలి నిర్మాత బండ్ల గణేష్. ఈయనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే.. చావు భయం తొలిసారి కళ్ళకు కనిపించిందని స్వయంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో 12 రోజుల పాటు ఉండి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే, కరోనా చికిత్స సమయంలో ఎలాంటి ఆహారం, మందులు తీసుకున్నారన్న అంశంపై బండ్ల గణేష్ తాజాగా సమాధనమిచ్చారు. ట్రీట్‌మెంట్ ఏం లేదు.. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు అంటున్నారు. 
 
"నాకు కరోనా పాజిటివ్ అని తెలిసి మొదట్లో చాలా భయపడ్డా. అయితే రోజూ గుడ్లు, శొంఠి, అల్లం, వెల్లుల్లి, వేడి నీళ్లు తీసుకునేవాడిని. అంతే 12 రోజుల్లో నెగిటివ్ వచ్చేసింది. రోజూ 7 గుడ్లు తినేవాడిని. ప్రతి రోజూ శొంఠి రసం తాగేవాడిని. ఇవి తీసుకుంటే చాలు. హాస్పిటల్‌కు వెళ్లి లక్షలకులక్షలు సమర్పించాల్సిన అవసరం లేదు' అని బండ్ల గణేష్ తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాప్ ప్రొడ్యూసర్‌కి షాక్ ఇచ్చిన ప్రభాస్..!