Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు!!

Kiara Advani

వరుణ్

, మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (11:21 IST)
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. వీరిలో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కాగా, మరొకరు నయనతారను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా "కల్కి" తెరకెక్కుతుంది. మరోవైపు, "రాజాసాబ్" చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాల్లో ప్రభాస్‌కి సంబంధించిన పోర్షన్ షూటింగును త్వరలోనే పూర్తికానున్నాయి. ఆ తర్వాత నుంచి ఆయన సందీప్ రెడ్డి వంగాతో కలిసి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. డిసెంబరు నుంచి స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. 
 
ఈ "స్పిరిట్" చిత్రంలో ఇద్దుర హీరోయిన్లను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఒక హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని, మరో హీరోయిన్ పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఈ ఇద్దరినీ తీసుకోవడం జరిగితే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌లో పెరిగిపోవడం ఖాయంగా తెలుస్తుంది. 
 
దక్షిణాది ప్రేక్షకుల్లో కియారా అద్వానీకి మంచి క్రేజ్ ఉంది. ఇక నయనతారకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, "జవాన్" సినిమాతో కూడా నయనతార మార్కెట్ బాలీవుడ్‌లోనూ పెరిగిపోయింది. దీంతో స్పిరిట్ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాగా, ఈ ప్రాజెక్టును రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లాప్‌లు వెంటాడినా.. పూజా హెగ్డేను వెతుక్కుంటూ వస్తోన్న ఆఫర్లు