Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓం నమో వేంకటేశాయ సినిమా ట్రైలర్.. సౌరభ్, నాగార్జున, అనుష్క భలే అనిపించారు.. (Video)

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' సినిమా టీజర్ రిలీజైంది. 'అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా... ఆనంద నిలయ వరపరిపాలక..' అంటూ సాగే ఈ

ఓం నమో వేంకటేశాయ సినిమా ట్రైలర్.. సౌరభ్, నాగార్జున, అనుష్క భలే అనిపించారు.. (Video)
, శనివారం, 24 డిశెంబరు 2016 (13:22 IST)
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' సినిమా టీజర్ రిలీజైంది. 'అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా... ఆనంద నిలయ వరపరిపాలక..' అంటూ సాగే ఈ టీజర్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'అన్నమయ్య', 'శ్రీ రామదాసు', 'శిరిడిసాయి' చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు, నాగార్జున, ఎం.ఎం. కీరవాణి కాంబినేషన్‌లో వస్తున్న భక్తిరస సినిమాలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌, సౌరభ్‌, జగపతిబాబు, విమలా రామన్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 
సాయి కృప ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున శ్రీవారి భక్తుడిగా నటించారు. అనుష్క ఈ చిత్రంలో గోదాదేవిగానూ శక్తి మాతగానూ వివిధ షేడ్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ ఇవ్వనుంది. ట్రైలర్ మీ కోసం..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం టైటిల్ అదేనా?