Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ రీమేక్‌లో చైతు న‌టిస్తున్నాడా..?

బాలీవుడ్ రీమేక్‌లో చైతు న‌టిస్తున్నాడా..?
, గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:32 IST)
అక్కినేని నాగచైత‌న్య ప్ర‌స్తుతం "వెంకీమామ" సినిమా చేస్తున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబ‌రు నెలాఖ‌రున ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా స్టార్ట్ చేశాడు. ఇందులో చైతు స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి న‌టిస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... గ‌త ఏడాది విడుద‌లైన 'బ‌దాయి హో' సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నారు.
 
ఈ సినిమాను తెలుగులో బోనీక‌పూర్, దిల్‌రాజు క‌లిసి నిర్మించ‌బోతున్నారు. ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేసేశార‌ట‌. స్క్రిప్ట్ అంతా ఫైన‌లైజ్ అయిన త‌ర్వాత ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులంటూకాకుండా ముందు నుండే ప్లానింగ్ చేసుకుంటున్నార‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా సినిమాను స్టార్ట్ చేసి పూర్తి చేయాల‌ని బోనీక‌పూర్‌, దిల్‌రాజు భావిస్తున్నార‌ట‌. హిందీలో ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్ర‌లో చైత‌న్య క‌నిపిస్తార‌ట‌.
 
బాలీవుడ్‌లో సీనియ‌ర్ నిర్మాత అయిన బోనీక‌పూర్ ఈ యేడాది అజిత్ న‌టించిన 'నెర్కొండ పార్వై' చిత్రంతో త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అక్క‌డ చాలా పెద్ద హిట్ అయ్యింది. అది కూడా అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన పింక్‌కి రీమేక్‌. ఇప్పుడు అజిత్‌తో మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించేస్తున్నారు బోనీక‌పూర్‌. 
 
కోలీవుడ్ త‌ర్వాత టాలీవుడ్ ఎంట్రీకి నిర్మాత‌గా రంగం సిద్ధం చేసేసుకున్నారు బోనీ క‌పూర్‌. శ్రీదేవి భ‌ర్త అయిన బోనీక‌పూర్ హిందీ నిర్మాతే అయినా.. తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉందనే సంగ‌తి తెలిసిందే. మ‌రి... ఈ రీమేక్ తో చైతు మ‌రో విజ‌యం సొంతం చేసుకుంటాడేమో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్‌కు ప్ర‌భాస్ స‌పోర్ట్.. దీని వెన‌కున్న అస‌లు కార‌ణం ఏంటి..?