Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దొంగ అవతారమెత్తిన హీరో... అంతలోనే కౌంటర్‌లో టిక్కెట్ల విక్రయం...

దొంగ అవతారమెత్తిన హీరో... అంతలోనే కౌంటర్‌లో టిక్కెట్ల విక్రయం...
, శుక్రవారం, 19 జులై 2019 (12:41 IST)
టాలీవుడ్ యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. ఈయన నటించిన తాజా చిత్రం "నిను వీడని నీడని నేనే". ఈ చిత్రం తాజాగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఇదే ఊపును మరికొన్నాళ్లు కొనసాగించేందుకు వీలుగా ఆయన సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర హీరోయిన్‌తో కలిసి ఆయన గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని కీలక పట్ణణాల్లో పర్యటిస్తూ సినిమాకు మంచి హైప్ తీసుకొస్తున్నారు. 
 
ఇందుకోసం ఆయన పలు వేషాలు కూడా వేశారు. ముందుగా దొంగ అవతారమెత్తాడు. ఆ తర్వాత రోడ్లమీ సైకిల్ తొక్కి జనాలకు సెల్ఫీలు ఇవ్వడం, కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కలుస్తూవారితో ముచ్చట్లు సాగించారు. ఆ తర్వాత థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను పలుకరించి, సందడి చేశారు. ఇలా ఒకటా రెండా.. అబ్బో.. అనేకం చేస్తూ సినిమాకు మరింత హైప్ తీసుకుని రావడానికి ఎంతో శ్రమిస్తున్నాడు. తాజాగా కాకినాడలోని ఓ థియేటర్‌లో కూర్చొని టిక్కెట్లను విక్రయించాడు. మొత్తానికి జనాలకు దగ్గరకావడమే కాకుండా అటు సినిమాకు కూడా మంచి ప్రచారమే చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్త కోడళ్ల మధ్య ఎంతటి బాహుబలి అయినా...