మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ధ్రువ. ప్రస్తుతం చరణ్ ఈ సినిమా షూటింగ్లో బిజీబిజీగా గడుపుతున్నాడు. తమిళంలో విజయం సాధించిన ''తని ఒరువన్''కి తెలుగులో ''ధృవ''గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్గా తమిళ నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ ఐపియస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే యువహీరో నవదీప్ ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా, ఓ ట్రైనీ ఐపియస్ ఆఫీసర్గా ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. నవదీప్కి ఇలా నటించడం కొత్తేమీకాదు. గతంలో ''ఓ మై ఫ్రెండ్'', ''ఆర్య 2'', ''బాద్ షా''లో కూడా నటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్తో కలిసి నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.