Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలపై కేసులు నమోదు చేయండి : నాంపల్లి కోర్టు ఆదేశం

venkatesh

వరుణ్

, సోమవారం, 29 జనవరి 2024 (12:13 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు హీరోలపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. ఒకరి విక్టరీ వెంకటేష్ అయితే మరొకరు ఆయన అన్న దగ్గుబాటి సురేష్ కుమారుడు, హీరో రానా దగ్గుబాటి. అలాగే, సురేష్ దగ్గుబాటి, అభిరామ్ దగ్గుబాటిలపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసినందుకు వీరిపై కేసుల నమోదుకు కానున్నాయి.
 
ఈ కిచెన్ యజమాని నందకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి డెక్కన్ కిచెన్‌ హోటల్‌ను కూల్చివేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే బిల్డింగ్‌ను ధ్వంసం చేసి ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లారని నందకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు, పోలీసులతో కుమ్మక్కైన వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్‌లు హోటల్‌ను కూల్చివేశారని తెలిపారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను ధ్వంసం చేశారన్నారు. దీనివల్ల తనకు రూ.20 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ హోటల్ కూల్చివేతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో వెంకటేష్, రానాతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ హీరో వేణు ఇంట విషాదం.. ఏం జరిగింది?