Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ఊపిరి''కి తర్వాత నిఖిల్‌తో మల్టీస్టారర్‌కు అక్కినేని నాగార్జున రెడీ

2016లో కార్తీతో కలిసి నటించిన ఊపిరి సినిమా బంపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అక్కినేని నాగార్జున, యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీ స్టారర్‌ మూవీ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది

Advertiesment
Nagarjuna and Nikhil Multi-Starrer On Cards
, మంగళవారం, 3 జనవరి 2017 (16:27 IST)
2016లో కార్తీతో కలిసి నటించిన ఊపిరి సినిమా బంపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అక్కినేని నాగార్జున, యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీ స్టారర్‌ మూవీ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని నాగార్జున ఉవ్విళ్లూరుతున్నారు.

నిఖిల్‌ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత నటిస్తున్న 'కేశవ' చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున, నిఖిల్ సినిమాను 'ప్రేమమ్‌'తో ఇటీవల మంచి సక్సెస్‌ అందుకున్న దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించనున్నారట. 
 
ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున ప్రస్తుతం తన తర్వాతి చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' పనుల్లో బిజీగా ఉన్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దావూద్ ఫోన్‌లో బెదిరిస్తున్నాడండీ బాబోయ్.. పాక్‍‌ నెంబర్ నుంచే కాల్.. అక్కడే ఉన్నాడా?