చైతూతో రొమాంటిక్ పాటల చిత్రీకరణలో శృతిహాసన్
నాగ చైతన్య, అనుపమ పరమేశ్వరన్, శతి హాసన్, మడోన్నా సెబాస్టియన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రంలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మళయాలంలో విజయం సాధించిన 'ప్రేమమ్' సినిమాను తెలుగులో అదే పేరుత
నాగ చైతన్య, అనుపమ పరమేశ్వరన్, శతి హాసన్, మడోన్నా సెబాస్టియన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రంలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మళయాలంలో విజయం సాధించిన 'ప్రేమమ్' సినిమాను తెలుగులో అదే పేరుతో నాగ చైతన్యతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను 'కార్తికేయ' దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా, వారం రోజులుగా నార్వేలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ నార్వే షెడ్యూల్లోనే పలు అందమైన లొకేషన్స్లో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. శృతి హాసన్, చైతన్య పాల్గొంటుండగా ప్రస్తుతం ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు చందూ మొండేటి, నాగ చైతన్య, సినిమాటోగ్రాఫర్ కార్తీక ఘట్టమనేనిలతో కలిసి దిగిన ఓ ఫోటోను శృతి హాసన్ పోస్ట్ చేశారు. తన కెరీర్కి బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలుస్తుందని నాగ చైతన్య మొదట్నుంచీ నమ్మకం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆగష్టులో విడుదల కానుంది.