Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎఫ్-2 బతికించింది.. ఆ మూడు సినిమాలు ముంచేశాయి..

ఎఫ్-2 బతికించింది.. ఆ మూడు సినిమాలు ముంచేశాయి..
, ఆదివారం, 27 జనవరి 2019 (17:36 IST)
అక్కినేని అఖిల్‌ను ఫ్లాప్‌లు వదలట్లేదు. అఖిల్, హలో, మజ్ను సినిమాలు హిట్ కాకుండా ఫ్లాప్ టాక్‌ను సంపాదించి పెట్టాయి. తెలుగు చిత్ర సీమకు 2018 బాగా కలిసొచ్చింది. అయితే 2019 కూడా వరుస హిట్లు వుంటాయని ట్రేడ్ వర్గాలు భావించారు. 
కానీ 2019 ప్రారంభంలోనే ఎన్టీఆర్, వినయ విధేయ రామ, ఎఫ్-2, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు విడుదలైనా.. ఈ సినిమాల్లో మూడు సినిమాలు ఓవర్సీస్ లో దారుణ పరాజయాన్ని చవి చూశాయి. ఎన్టీఆర్, వినయ విధేయ రామ సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదలైనా మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ కాలేకపోయాయి. వినయ, ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ  'ఎఫ్2' మాత్రమే ఇప్పటికే 2 మిలియన్ క్లబ్ లో చేరడం విశేషం. 
 
భారీ అంచనాల మధ్య జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ మజ్ను డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా 3 కోట్ల ఓవర్సీస్ బిజినెస్ జరిగింది.
 
అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న మజ్ను కూడా ఫ్లాప్ కావడంతో.. టాలీవుడ్‌కు 2019 ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. కామెడీకి పెద్ద ప్రాధాన్యం ఇచ్చిన వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్‌ల ఎఫ్-2 మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సాధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగనా రనౌత్.. ఎలా నిద్రపోతుందో అర్థం కావట్లేదు.. క్రిష్