Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌ముఖ నిర్మాత శేఖ‌ర్ బాబు క‌న్నుమూత‌... సంతాపం తెలిపిన చిరు

ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖ‌ర్ బాబు (71) శుక్ర‌వారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కృష్ణ -జ‌మున కాంబినేష‌న్లో `మమత` అనే చిత్రాన్ని,

Advertiesment
Megastar Chiranjeevi Condolences
, శనివారం, 25 ఫిబ్రవరి 2017 (16:39 IST)
ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖ‌ర్ బాబు (71) శుక్ర‌వారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కృష్ణ -జ‌మున కాంబినేష‌న్లో `మమత` అనే చిత్రాన్ని, త‌ర్వాత అదే హీరోతో `స‌ర్దార్`, మెగాస్టార్ చిరంజీవితో `ముఠామేస్త్రీ`, `సంసారబంధం`, `గోపాలరావుగారి అమ్మాయి`, `పక్కింటి అమ్మాయి` చిత్రాలను నిర్మించారు.
 
సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కూడా ఆయ‌న విశేష సేవ‌లందించారు. ఫిలిం సెంట్ర‌ల్ బోర్డ్ చైర్మ‌న్‌గా, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీగా ఆయ‌న ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాది ఫిలించాంబ‌ర్ క‌మిటీ మెంబ‌ర్‌గా సేవ‌లందిస్తున్నారు. ఇంత‌లోనే ఆయ‌న హఠాన్మ‌ర‌ణం టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ని క‌ల‌చి వేసింది. శేఖర్‌బాబు మృతిపట్ల పలువురు సినీ నటులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. చిరంజీవి శేఖర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిల్ పెళ్లి క్యాన్సిల్.. సమంత-చైతూలపై ఒత్తిడి.. అదే ముహూర్తంలో పెళ్లి?