Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Advertiesment
manchu manoj

ఠాగూర్

, శుక్రవారం, 30 మే 2025 (13:23 IST)
హీరో మంచు మనోజ్ శుక్రవారం చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. తాను నటించిన చిత్రం "భైరవం" శుక్రవారం విడుదలైంది. దీన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా ఈ ఆసక్తికర ట్వీట్‌తో పాటు ఓ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన తండ్రి, హీరో మోహన్ బాబు నటించిన 'పెదరాయుడు' చిత్రంలో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటోను ఎడిట్ చేసి పంచుకున్నాడు. దీనికి ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అనే క్యాప్షన్ ఇచ్చారు. 
 
కాగా, తండ్రి మోహన్ బాబుతో వివాదాలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ పోస్టు చేయడం గమనార్హం. తన తండ్రి పాదాలను తాకాలని ఉందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ భావోద్వేగానికి గురైన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన "భైరవం" శుక్రవారం విడుదలైంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటివరకు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారనే టాక్ వస్తోంది. మనోజ్ సినిమాలకు దాదాపు తొమ్మిదేళ్లు దూరమైన తర్వాత చేసిన మూవీ ఇది. దీంతో ఆయన అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!