Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

`స‌ర్కారు వారి పాట‌` హైద‌రాబాద్ చిత్రీక‌ర‌ణ‌లో మ‌హేష్‌బాబు

`స‌ర్కారు వారి పాట‌` హైద‌రాబాద్ చిత్రీక‌ర‌ణ‌లో మ‌హేష్‌బాబు
, మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (19:48 IST)
Sarkaru Vari Pata
సూపర్ స్టార్మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం 'సర్కారు వారి పాట`.మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ మూవీ ఇటీవ‌ల దుబాయ్‌లో నెల‌రోజుల పాటు షూటింగ్ జ‌రుపుకుంది. ఆ షెడ్యూల్ త‌ర్వాత  ఈ రోజు (ఏప్రిల్ 13) ఉగాది ప‌ర్వ‌దినం రోజున హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించింది చిత్ర యూనిట్‌. ఈ షెడ్యూల్ ఈనెలాఖ‌రు వ‌ర‌కూ  కంటిన్యూగా జ‌రుగుతుంది. మ‌హేష్‌బాబు, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌స్తోన్న `స‌ర్కారు వారి పాట` చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.
 
సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,
సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,
ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్,
ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్,
పిఆర్ఓ: బి.ఎ.రాజు,  
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్,
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్,    
సీఈఓ: చెర్రీ,
నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది సాయికుమార్ హీరోగా చిత్రం ప్రారంభం