Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జర్నలిస్టుగా జ్యోతిక... మగలీర్ మట్టుమ్‌లో శరణ్య, భానుప్రియ, ఊర్వశిలతో..?

హీరో సూర్యతో వివాహానికి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన జ్యోతిక.. 36 వయదినిలే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ రెండో సినిమా తెరపైకి వచ్చేందుకు జ్యోతిక రెడీ అవుతోంది. సూర్య నిర్మాతగ

జర్నలిస్టుగా జ్యోతిక... మగలీర్ మట్టుమ్‌లో శరణ్య, భానుప్రియ, ఊర్వశిలతో..?
, బుధవారం, 12 అక్టోబరు 2016 (11:27 IST)
హీరో సూర్యతో వివాహానికి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన జ్యోతిక.. 36 వయదినిలే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ రెండో సినిమా తెరపైకి వచ్చేందుకు జ్యోతిక రెడీ అవుతోంది. సూర్య నిర్మాతగా తెరకెక్కిన 36 వయదినిలేతో జ్యోతికకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో.. మరో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది జ్యోతిక. 
 
మగలిర్ మట్టుమ్ అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో జ్యోతిక జర్నలిస్ట్‌గా కనిపించనుంది. మరోసారి సూర్య నిర్మాతగా తెరకెక్కుతోంది. బ్రహ్మ ఈ సినిమాకు దర్శకుడు. ఇక దసరాను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. జ్యోతికతో పాటు సీనియర్ నటీమణులు శరణ్య, భానుప్రియ, ఊర్వశిలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సురేష్ బాబుతో రానా సినిమా.. తండ్రులతో డేంజర్ గురూ.. నువ్వు జాగ్రత్తగా ఉండంటూ కేటీఆర్ ట్వీట్