Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భగవంతుడు అన్యాయం చేశాడు.. శ్రీదేవి చూసి ఎంతో నేర్చుకున్నా: చిరంజీవి

అతిలోకసుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. శ్రీదేవి మరణవార్త విని షాక్ అయిన మెగాస్టార్ చిరంజీవి.. శ్రీదేవి లాంటి నటి గతంలో ఎవరూ లేరని, భవిష్యత్తులో వస్తారని కూడా తాను భావించడం లేదని తెలిప

భగవంతుడు అన్యాయం చేశాడు.. శ్రీదేవి చూసి ఎంతో నేర్చుకున్నా: చిరంజీవి
, ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (13:29 IST)
అతిలోకసుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. శ్రీదేవి మరణవార్త విని షాక్ అయిన మెగాస్టార్ చిరంజీవి.. శ్రీదేవి లాంటి నటి గతంలో ఎవరూ లేరని, భవిష్యత్తులో వస్తారని కూడా తాను భావించడం లేదని తెలిపారు. అందం, అభినయం కలబోసిన అద్భుతమైన నటి అతిలోక సుందరి అంటూ మెగాస్టార్ చెప్పారు. శ్రీదేవి అంకితభావాన్ని చూసి తాను కూడా ఎంతో నేర్చుకున్నానని స్ఫూర్తి పొందానని చిరంజీవి తెలిపారు.
 
రాణికాసుల రంగమ్మ అనే సినిమా చేశామని.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసినప్పటికీ... తమ కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన సినిమా ''జగదేకవీరుడు అతిలోకసుందరి'' అని చిరంజీవి తెలిపారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో దేవత పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయిందని... ఆ పాత్ర కోసమే ఆవిడ పుట్టిందా అనిపించిందని చిరంజీవి కొనియాడారు. 
 
సినిమాల పరంగానే కాకుండా, ఆమె కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉందని చిరంజీవి వెల్లడించారు. తన 60వ పుట్టినరోజు వేడుకకు కూడా శ్రీదేవి, బోనీకపూర్ ఇద్దరూ వచ్చారని, తనకు శుభాకాంక్షలు తెలియజేశారని గుర్తు చేసుకున్నారు. కానీ ఆదివారం ఉదయం ఆమె మరణవార్తను వినగానే షాక్‌కు గురయ్యానని చెప్పుకొచ్చారు. 
 
వాస్తవాన్ని జీర్ణించుకోవడం మొదలు పెట్టాక తన మనసు మనసులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంత గొప్ప శ్రీదేవిని పోగొట్టుకోవడం అందరి దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు చాలా అన్యాయం చేశాడని... మన శ్రీదేవిని మనకు దూరం చేశాడని చెప్పుకొచ్చారు. శ్రీదేవి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన ధృవతార : జూనియర్ ఎన్టీఆర్