మలయాళ ప్రేమమ్ సినిమాను నాగచైతన్య హీరోగా యువ దర్శకుడు చందూ మొండేటి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ యువకుడి యవ్వన దశలో తొలి ప్రేమ మొదలు.. అతడి వివాహం వరకు చూపించే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.
హీరో ఫస్ట్ లవర్గా అనుపమ పరమేశ్వరన్, లెక్చరర్ పాత్రలో శ్రుతిహాసన్, ఇక మూడో హీరోయిన్గా మలయాళ ఒరిజినల్లో నటించిన మడోన్నా సెబాస్టియనే తెలుగులోనూ నటిస్తుందని క్లారిటీ వచ్చేసింది. చివర్లో వచ్చే పెళ్లి సన్నివేశానికి సంబంధించిన ఫొటో నెట్లో హల్ చల్ సృష్టిస్తోంది.
చైతూ-మడోన్నా రిసెప్షన్లో నిలబడి ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన సన్నివేశాల్ని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. దీంతో ‘ప్రేమమ్’ టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందట అన్నీ పనులు పూర్తి చేసుకుని జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది.