Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూరీ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు.. అంతగా దిగజారడు: కృష్ణవంశీ

గ్స్ వ్యవహారంలో సిట్ అధికారులు పూరీని విచారించడంపై డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ… పూరీ వ్యవహారాన్ని మొత్తం చిత్ర పరిశ్రమకు ముడిపెట్టడం సరికాదన్నారు. డ్రగ్స్‌ కేసులోంచి పూరీ క్లీన్‌చిట్‌తో బయటకు వస్తా

పూరీ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు.. అంతగా దిగజారడు: కృష్ణవంశీ
, గురువారం, 3 ఆగస్టు 2017 (11:56 IST)
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ ముందు విచారణ ఎదుర్కొన్న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పైసా వసూల్ ప్రమోషన్‌లో బిజీగా వున్నాడు. నందమూరి నట సింహం బాలకృష్ణ, పూరీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' సినిమా టీజర్‌తో సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బాలకృష్ణగారికి అభిమాన సంఘం ఉంటే నేనే దానికి అధ్యక్షుణ్ని అవుతానని పూరీ జగన్నాథ్ అన్నారు. బాలయ్యతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. 
 
ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంలో సిట్ అధికారులు పూరీని విచారించడంపై డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ… పూరీ వ్యవహారాన్ని మొత్తం చిత్ర పరిశ్రమకు ముడిపెట్టడం సరికాదన్నారు. డ్రగ్స్‌ కేసులోంచి పూరీ క్లీన్‌చిట్‌తో బయటకు వస్తారన్నారు. పూరీ వ్యక్తిత్వమేమిటో తనకు బాగా తెలుసునని, ఆయన అంత దిగజారడన్నారు.
 
పూరీ జగన్నాథ్ సమాజాన్ని ఉపయోగపడే మంచి సందేశాత్మకమైన చిత్రాలను అందించారని కృష్ణవంశీ గుర్తు చేశారు. ఇక కృష్ణవంశీ తాజా చిత్రం ‘నక్షత్రం’ ఈ నెల 4న విడుదల కానుంది. ఈ చిత్రంతో కృష్ణవంశీ హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. నక్షత్రంలో సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా కసాండ్రా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్, తనీష్ తదితరులు నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఆత్మను, మట్టి పరిమళాన్ని పట్టుకున్న తొలి చిత్రం ఫిదా.. సుద్దాల అశోక్ భావోద్వేగ ప్రసంగం