Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గచ్చి బౌలి స్టేడియంకు కృష్ణ గారి పార్ధివ దేహాన్ని తీసుకెళ్లడం లేదు

mahesh,chaitu,ntr
, మంగళవారం, 15 నవంబరు 2022 (18:32 IST)
mahesh,chaitu,ntr
సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. టి. ఆర్., నాగ చైతన్య తదితరులు నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం గచ్చి బౌలి స్టేడియంకు తరలిస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ కొద్దీ సేపటి క్రితమే నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు మార్చారు. చలి కాలం త్యరగా పొద్దు పోవడంతో పాటు అభిమానులు కోరిక మేరకు కృష్ణ గారి ఇంటి వద్దే ఉంచాలని ఆయన ఇంటిని చివరిసారిగా చూడాలని బుర్రిపాలెం ప్రజలు కోరినట్లు తెలుస్తోంది.
 
మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయం వద్దే ఉంచుతున్నారు. అభిమానులు ఇక్కడికే వచ్చి నివాళులు అర్పించవచ్చు. రేపు (బుధవారం) మధ్యాహ్నం  తర్వాత ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అంత్యక్రియలు జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిత్యం గురించి శ్రీశ్రీ పలుకులు