Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందూపురం బాధితుల కోసం 20 లక్షల విలువైన కోవిడ్ మందులు

Advertiesment
Nandamuri bala krishna
, గురువారం, 13 మే 2021 (15:55 IST)
Hindupuram kovid kits
అనంతపురంలోని హిందూపురం కోవిడ్  బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందులను  హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ పంపించారు. వాటిని ఈరోజు స్థానిక ఎం.ఎల్‌.ఎ. ఇంటి ద‌గ్గ‌ర ఆయ‌న అభిమానులు, తెలుగు దేశం కార్య‌క‌ర్త‌లు కోవెడ్  కిట్స్ ను బాధితుల‌కు అంద‌జేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ, నంద‌మూరి బాల‌కృష్ణ సేవా స‌మితి త‌ర‌ఫున 2వేల కిట్లు అంద‌జేయ‌డం జ‌రిగింది. 20 ల‌క్ష‌ల విలువైన మందుల‌ను కోవిడ్ బాధితుల‌కు ఇవ్వ‌మ‌ని బాల‌కృష్ణ‌గారు పంపించారు. క‌రోనా పాజిటివ్ వున్న వారు ఎం.ఎల్‌.ఎ. ఇంటికి వ‌చ్చిన వారి త‌ర‌ఫున వారు ఎవ‌రైనా తీసుకెళ్ళ‌గ‌ల‌రు. గ‌త వారంలో ప్ర‌భుత్వాసుప‌త్రిలో కూడా కొన్ని మందులు అంద‌జేయ‌గం జ‌రిగింది. బాల‌కృష్ణ గారు ఎక్క‌డ వున్నా హిందూపురం ప్ర‌జ‌ల బాగోగుల‌ను చూస్తూనేవుంటారు. క‌లెక్ట‌ర్‌తోనూ, మంత్రుల‌తో చ‌ర్చిస్తూనే వుంటారు. 
 
అయితే గ‌తంలో క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌డు బాల‌కృష్ణ‌గారు వైద్య‌ప‌రిక‌రాలు, వెంటిలేట‌ర్ల‌ను ప్ర‌భుత్వాసుప‌త్రికి పంపించారు. కాని వాటిని వారు నిరుప‌యోగంగా చేశారు. చాలా బాధాక‌రం అది. ఇది అంద‌రూ ఆలోచించాల్సిన విష‌యం. ఎవ‌రైనా దాత‌లు ఇస్తే వాటిని వినియోగించుకోవాల‌ని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీఎన్నార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం