Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ‌లో `ఖైదీ నంబ‌ర్ 150`

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `ఖైదీ నంబ‌ర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్‌) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే యూర‌ప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. నిన్న‌టి(గురువారం)తో

చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ‌లో `ఖైదీ నంబ‌ర్ 150`
, శుక్రవారం, 2 డిశెంబరు 2016 (21:53 IST)
మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `ఖైదీ నంబ‌ర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్‌) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే యూర‌ప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. నిన్న‌టి(గురువారం)తో టాకీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రామోజీ ఫిలింసిటీలో బ్యాలెన్స్ సాంగ్‌ను నేటి నుంచి చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట చిత్ర‌ణ‌తో మొత్తం షూటింగ్ పూర్త‌యిన‌ట్టే.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ-``మెగాస్టార్ కెరీర్‌లోనే వెరీ స్పెష‌ల్ మూవీ ఇది. ఓ చ‌క్క‌ని క‌థాంశంతో, విజువ‌ల్ గ్రాండియారిటీతో ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ గారు అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. యూత్‌ స‌హా కుటుంబ స‌మేతంగా అంతా క‌లిసి చూడ‌ద‌గ్గ చిత్రంగా మ‌లిచారు. నిన్న‌టితో టాకీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నేటి నుంచి రామోజీ ఫిలింసిటీలో చివ‌రి పాటను తెర‌కెక్కిస్తున్నారు. ఈ పాట‌తో మొత్తం షూటింగ్ పూర్త‌యిన‌ట్టే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబరు 16న 'మీలో ఎవరు కోటీశ్వరుడు'