Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖైదీ నెం.150కి ఆంధ్రాలో థియేటర్లు దొరకలేదా? ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కే ఇబ్బందులు తప్పలేదా?

సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లోనే ఈ సినిమా రూ. 100కోట్లు కొల్లగొట్టింది. మెగాస్టార్ రీ-ఎంట్రీ అదిరిపోవడంతో మెగా ఫ్యామిలీ, మెగా అభిమానుల

ఖైదీ నెం.150కి ఆంధ్రాలో థియేటర్లు దొరకలేదా? ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కే ఇబ్బందులు తప్పలేదా?
, గురువారం, 19 జనవరి 2017 (19:33 IST)
సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లోనే ఈ సినిమా రూ. 100కోట్లు కొల్లగొట్టింది. మెగాస్టార్ రీ-ఎంట్రీ అదిరిపోవడంతో మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు ఆనందంలో ఉన్నారు. ఈ ఆనందంలోనే విజయోత్సవ సభ జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే, కొన్ని చోట్ల మెగా ఖైదీని అన్యాయం జరిగిందంటూ మెగా అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. 
 
గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతికే రిలీజ్ కావడంతో ఆంధ్రాలో సరైన థియేటర్స్ దక్కలేదని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ విషయాన్ని మెగా ఖైదీకి కొన్ని చోట్ల అన్యాయం జరుగుతుందని దర్శకుడు వినాయక్ దృష్టికి ఫ్యాన్స్ తీసుకొచ్చారని వారిని ఆయన నచ్చజెప్పి పంపారని టాలీవుడ్ టాక్. మెగా ఖైదీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సమయంలోనూ చిత్రబృందాన్ని ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు థియేటర్ల విషయంలోనూ మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను.. చిరంజీవి వీలు దొరికినప్పుడల్లా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకుంటాం: బాలయ్య