Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధనుష్, శింబు నా వద్ద దురుసుగా ప్రవర్తించారు.. సుచిత్ర ఆరోపణలు నిజమేనా?

కోలీవుడ్ హీరోలు ధనుష్, శింబులపై తమిళ గాయని సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. తెలుగులో సారొచ్చారు.. డోలె డోలె వంటి పాటలు పాడిన ఈమె.. నటి భావన లైంగిక దాడి ఘటనతో షాకైన వారందరికీ.. మరో షాకిచ్చింది. ధనుష్, శి

ధనుష్, శింబు నా వద్ద దురుసుగా ప్రవర్తించారు.. సుచిత్ర ఆరోపణలు నిజమేనా?
, శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (15:41 IST)
కోలీవుడ్ హీరోలు ధనుష్, శింబులపై తమిళ గాయని సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. తెలుగులో సారొచ్చారు.. డోలె డోలె వంటి పాటలు పాడిన ఈమె.. నటి భావన లైంగిక దాడి ఘటనతో షాకైన వారందరికీ.. మరో షాకిచ్చింది. ధనుష్, శింబులు తన వద్ద దురుసుగా ప్రవర్తించడం ద్వారా తాను గాయాల పాలైనట్లు సుచిత్ర ట్విట్టర్ ద్వారా ఆరోపణలు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఇంకా ధనుష్, శింబు తనతో దురుసుగా ప్రవర్తించారనేందుకు ఆధారాలను కూడా ట్వీట్ చేసింది. ఈ క్రమంలో తన చేతిపై చేసిన గాయాల ఫోటోలను కూడా ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో పొందుపరించింది. 
 
అయితే సుచిత్ర ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందని, ధనుష్‌, శింబులపై ఆరోపణలు అబద్ధమని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆమె మరోసారి ట్విట్టర్‌ ద్వారా బాంబు పేల్చింది. ధనుష్ ప్రవర్తన గురించి అందరికీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఇదంతా ఊహాజనితం కాదని చెప్పింది. అయితే సుచిత్ర వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నా.. ఆమె మీడియా ముందుకు వస్తే కానీ ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియరాదని సినీ పండితులు అంటున్నారు. కానీ సుచిత్ర భర్త, నటుడు కార్తీ మాత్రం సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి2..పోస్టర్ రిలీజ్.. వీడియో చూడండి.. (Video)