Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీరవ్ ''గీతాంజలి''తో కంగనా రనౌత్‌, బిపాసా బసులకు కష్టాలు

తాజాగా పీఎన్‌బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో కాంట్రాక్ట్‌ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రద్దు చేసుకున్న నేపథ్యంలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను మోసం చేసినట్లు ఆ

నీరవ్ ''గీతాంజలి''తో కంగనా రనౌత్‌, బిపాసా బసులకు కష్టాలు
, గురువారం, 22 ఫిబ్రవరి 2018 (10:07 IST)
తాజాగా పీఎన్‌బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో కాంట్రాక్ట్‌ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రద్దు చేసుకున్న నేపథ్యంలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీ పేరు కూడా రావడంతో ఆయన నేతృత్వంలోని ''గీతాంజలి'' జెమ్స్‌కు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు బిపాసా బసు, కంగనా రనౌత్‌లు మండిపడుతున్నారు. 
 
అందుకు కారణం కంపెనీ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన వారికి ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడమే. గీతాంజలి బ్రాండ్‌లు నక్షత్ర, గిలికి ప్రచారకర్తలుగా వ్యవహరించేందుకు బిపాసా, కంగనా రనౌత్‌లో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.
 
నక్షత్ర బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. కానీ ఒప్పందం ప్రకారం ఆమెకు చెల్లించాల్సిన మొత్తాన్ని కంపెనీ ఇవ్వలేదని ఆమె నటించిన క్వీన్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై లాంటి చిత్రాలకు ప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి చెప్పారు. నక్షత్ర బ్రాండ్ కోసం 2016లో కంగనా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో చెర్రీ "రంగస్థలం"?