Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాలా కంఫర్టుగా ఉండే ప్రదేశం అదొక్కటే : కంగనా రనౌత్

Advertiesment
Kangana Ranaut
, సోమవారం, 5 అక్టోబరు 2020 (12:05 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్‌లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్నారు. కరోనా లాక్డౌన్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆమె చెన్నైకు వచ్చి, షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆదివారం జరిగిన షూటింగ్‌లో ఆమె పాల్గొంది. ఈ విషయాన్ని కంగనా తెలియజేస్తూ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ తనకు సీన్‌ వివరిస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. 
 
'టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ నాకు సీన్‌ను వివరిస్తున్నారు. ఈ ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ చాలా కంఫర్ట్‌ అయిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఫిలింసెట్‌ మాత్రమే' అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ నెపోటిజం, డ్రగ్‌ మాఫియా తదితర అంశాలపై కంగనా రనౌత్‌ తనదైనశైలిలో స్పందించారు. దీంతో మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీ నేతలతో ఆమెకు వైరం ఏర్పడటంతో ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో ఆమె పోల్చారు. ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని శివసేన నేతలు కంగనా రనౌత్ సినీ కార్యాలయాన్ని కూల్చివేశారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ నాలుగో సీజన్- గంగవ్వ చాడీల చిట్టానా?