Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూరీ 'ఇజం' రిపేర్లు చేయబడుతున్నాయా? అన్న సినిమాను అమ్మి పెడుతున్న ఎన్టీఆర్

ఎన్‌టిఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌ సోదరులిద్దరూ తమ చిత్రాలకు ఒకరికొకరు అండగా నిలుస్తారని పరిశ్రమలో విన్పిస్తోంది. విజయాలతో ముందుకు సాగుతున్న వీరిద్దరూ ప్రస్తుతం ఒకరి సినిమాలకు ఒకరు సాయం చేసుకుంటున్నారు

పూరీ 'ఇజం' రిపేర్లు చేయబడుతున్నాయా? అన్న సినిమాను అమ్మి పెడుతున్న ఎన్టీఆర్
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (16:52 IST)
ఎన్‌టిఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌ సోదరులిద్దరూ తమ చిత్రాలకు ఒకరికొకరు అండగా నిలుస్తారని పరిశ్రమలో విన్పిస్తోంది. విజయాలతో ముందుకు సాగుతున్న వీరిద్దరూ ప్రస్తుతం ఒకరి సినిమాలకు ఒకరు సాయం చేసుకుంటున్నారు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా 'ఇజం' చిత్రం తెరకెక్కింది. కల్యాణ్‌ రామ్‌ సొంత బ్యానర్‌ పైన ఈ సినిమా రూపొందింది. 
 
దాదాపు 26 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది. తగిన రేంజ్‌లో అమ్మడం సులువైన విషయం కాదని అర్థమవుతోంది. అందుకు దర్శకుడు పూరికి ఇటీవల సరైన హిట్‌ లేకపోవడం బయ్యర్లను ఆలోచించేలా చేస్తుంది. కనుకనే ఎన్టీఆర్‌ కలుగచేసుకుని తన చిత్రాలకున్న బయ్యర్లతో సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నాడని సమాచారం. వారికి 'ఇజం' బాధ్యతను అప్పగించినట్టుగా సమాచారం. ముందుముందు ఇదే బ్యానర్‌లో పూరితో ఎన్టీఆర్‌ సినిమా ఉన్నందువలన, బయ్యర్లు ఉత్సాహాన్ని చూపుతున్నారని చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలి లులియాతో ''పెళ్లి కాలేదు.. అదీ కాలేదు'' : సల్మాన్ ఖాన్