''కబాలి'' ఫీవర్.. రజనీకాంత్ బొమ్మను వెండి నాణేలపై ముద్రించిన ముత్తూట్!
సినీ చరిత్రలోనే సూపర్స్టార్ రజినీకాంత్ ''కబాలి'' చిత్రానికున్నంత క్రేజ్ ఇప్పటివరకు విడుదలైన ఏ చిత్రానికి కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన కబాలి మానియానే కనిపిస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి
సినీ చరిత్రలోనే సూపర్స్టార్ రజినీకాంత్ ''కబాలి'' చిత్రానికున్నంత క్రేజ్ ఇప్పటివరకు విడుదలైన ఏ చిత్రానికి కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన కబాలి మానియానే కనిపిస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్గా నటించింది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ ధాను నిర్మించారు. ఇప్పటికే ఓ విమానాన్ని కబాలి పోస్టర్లతో అలంకరించగా, ఎయిర్ టెల్ ఏకంగా ప్రత్యేక సిమ్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్రం కేరళకు చెందిన ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్తో ఒప్పదం కుదుర్చుకుంది. రజనీకాంత్ బొమ్మను వెండి నాణేలపై ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా ఉన్నముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచీల ద్వారా సరఫరా చేయడానికి ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందట. 5 గ్రాముల నాణాన్ని, రూ. 350కి, 10 గ్రాముల నాణాన్ని రూ. 700కు, 20 గ్రాముల నాణాన్ని రూ. 1400కు అందిస్తామని ఈ సంస్థ ప్రకటించింది.
వీటిని 15 తేదీనుండి బుక్ చేసుకోవచ్చని, చిత్రం విడుదల తరువాత డెలివరీ ఇస్తామని ప్రకటించింది. సినిమా విడుదల తర్వాతే ఇవి అందుబాటులోకి వస్తాయని ముత్తూట్ అధికారి కెయూర్ షా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జూలై 22న రిలీజ్ కానుంది.