Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచు మనోజ్ పచ్చి అబద్ధాలకోరు.. నిర్మాతపై దాడి చేయలేదు : జూనియర్ ఆర్టిస్టులు

Advertiesment
Junior Artist
, మంగళవారం, 2 ఆగస్టు 2016 (14:44 IST)
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌పై జూనియర్ ఆర్టిస్టులు మండిపడ్డారు. నిర్మాతపై తాము దాడి చేసినట్టుగా ఆయన పచ్చి అబద్ధాలు చెపుతున్నారంటూ మండిపడ్డారు. విశాఖపట్టణంలో టాలీవుడ్ నిర్మాత అచ్చిబాబుపై దాడి చేశారనీ, ఈ విషయాన్ని నిర్మాతల మండలి  సీరియస్‌గా తీసుకున్నట్టు మంచు మనోజ్ మంగళవారం ప్రకటించారు. 
 
దీనిపై జూనియర్ ఆర్టిస్టులు ప్రసాద్, వెంకటేశ్ లు మంచు మనోజ్ ఆరోపిస్తున్నట్లు తాము అచ్చిబాబుపై ఎలాంటి దాడికి పాల్పడలేదని తెలిపారు. అచ్చిబాబు తమకు బకాయి ఉన్నారని, ఆ బకాయిలు చెల్లించమని మాత్రమే అడిగామని తెలిపారు. పలువురికి జీవనోపాధి కల్పిస్తున్న మంచు మనోజ్ వంటి వారు ఈ రకంగా తమపై తప్పుడు ఆరోపణలు చేయడం తమను ఆవేదనకు గురి చేస్తోందని వారు చెప్పారు.
 
అంతకుముందు మంచు మనోజ్ స్పందిస్తూ... విశాఖలో టాలీవుడ్ నిర్మాత అచ్చిబాబుపై జరిగిన దాడిని పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చరిత్రలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ కేంద్రంగానే చిత్ర నిర్మాణం జరుగుతున్నా... విశాఖలో షూటింగ్ అంటే హుషారుగా కదిలివస్తున్న తాము ఈ దాడి నేపథ్యంలో ఇక్కడికి రావాలంటేనే జడవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఫెడరేషన్ కార్డులు లేని జూనియర్ ఆర్టిస్టులే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ పుస్తకాల పురుగట.. మరి జనాలు మరిచిపోతున్నారా? ఐదు నెలల డెడ్ లైన్ ఎందుకు?