Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర- భార్య నుదుటపై కుంకుమ (వీడియో)

Advertiesment
Jr NTR

ఠాగూర్

, ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (09:16 IST)
Jr NTR
జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర చేపట్టారు. కుటుంబ సమేతంగా ఉడిపిలో పర్యటించారు. తన తల్లి స్వగ్రామం కర్ణాటకలోని కుదపురకు కుటుంబంతో సహా వెళ్లాడు. అంతేకాకుండా ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి పూజలు చేశారు. అక్కడ కాంతార హీరో రిషబ్‌ శెట్టి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌కు సహకారం అందించారు. ఎన్టీఆర్‌ పర్యటనలో వారిద్దరూ పక్కనే ఉన్నారు. ఆలయంలో రిషబ్‌ శెట్టి, ప్రశాంత్‌ నీల్‌ స్వాగతం పలికారు. ప్రత్యేకంగా దర్శనం చేయించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
 
ఉడిపి యాత్ర విశేషాలను ఎన్టీఆర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. "మా అమ్మ చిరకాల కల అయినా ఆమె స్వగ్రామం కుందపుర, ఉడిపి శ్రీకృష్ణ మఠం సందర్శన తీరిపోయింది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్‌ 2వ తేదీకి రెండు రోజుల ముందే తీరడంతో ఆమెకు ఇంతకు మించి ఇలాంటి గిఫ్ట్‌ ఏనాడు ఇవ్వలేదు" అని ఎన్టీఆర్‌ పోస్టుచేశారు. ఇంకా సందర్భంగా ఎన్టీఆర్ భార్య ప్రణతికి నుదుటన బొట్టుపెట్టిన వీడియో, ప్రశాంత్ నీల్, రిషబ్‌తో కలిసి భోజనం చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు : శ్రీకాంత్