జూనియర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారెజ్' ఫ్యాన్స్తో ప్రమోషన్
సినిమా ప్రమోషన్ కొత్త పుంతలు తొక్కుతుంది. సినిమాపై క్రేజ్ రావడానికి ఏకంగా ఫ్యాన్స్ కూడా వాడుకుంటున్న సందర్భంగా 'జనతా గ్యారెజ్' టీమ్ది. చిత్ర దర్శక నిర్మాతలు వినూత్నంగా ఆలోచించి.. అభిమానులను ఆహ్వా
సినిమా ప్రమోషన్ కొత్త పుంతలు తొక్కుతుంది. సినిమాపై క్రేజ్ రావడానికి ఏకంగా ఫ్యాన్స్ కూడా వాడుకుంటున్న సందర్భంగా 'జనతా గ్యారెజ్' టీమ్ది. చిత్ర దర్శక నిర్మాతలు వినూత్నంగా ఆలోచించి.. అభిమానులను ఆహ్వానిస్తూ కొన్ని కాంటెస్ట్లు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకు డైరెక్షన్ టీమ్లోని కొందరిని ఇచ్చిన ప్లాన్ ప్రకారం నేటినుంచి అమలు పర్చనున్నారు.
కాలేజీలు, షామింగ్మాల్స్తోపాటు సోషల్మీడియాలో సినిమా గురించి ఆర్భాటంగా చెప్పాలనేది ప్లాన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాను వచ్చేనెల 2న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు పవన్కళ్యాణ్ పుట్టినరోజు కావడం విశేషం. అనుకున్నట్లు అన్నీ జరిగితే.. ఆ డేట్లో వస్తుందనీ. లేదంటే వారంరోజులు పోస్ట్పోన్ కావచ్చని విశ్వసనీయ సమాచారం.
'శ్రీమంతుడు' నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ టీమ్, తమ రెండో సినిమా నిర్మించింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు.