Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నాడీఎంకే విజయం చారిత్రాత్మకం.. ప్రజా సేవకే రాజకీయాల్లోకి వచ్చా : నటి నమిత

Advertiesment
అన్నాడీఎంకే విజయం చారిత్రాత్మకం.. ప్రజా సేవకే రాజకీయాల్లోకి వచ్చా : నటి నమిత
, ఆదివారం, 22 మే 2016 (16:08 IST)
సినీ నటి నమిత శనివారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆమెతో పాటు పలువురు వీఐపీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇస్రో డైరెక్టర్‌ జయరామన్‌, కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, ఇంకా అనేకమంది ఉన్నారు. 
 
శ్రీవారి దర్శనం చేసుకుని నటి నమిత ఆలయం వెలుపలకు రాగానే అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. అంతేనా... ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడిఎంకే విజయం సాధించడంతో తాను శ్రీవారిని దర్శనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ విజయం చారిత్రాత్మకమైనదన్నారు. 
 
1984 సంవత్సరం తర్వాత తమిళ నాట ప్రజలు అమ్మ(జయలలిత)పై నమ్మకం ఉంచి వరుసగా రెండోసారి గెలిపించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను కూడా ఎప్పుడూ ముందుంటానని, అందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారితో పోల్చినందుకే 'బ్రహ్మోత్సవం' సినిమా ఫెయిల్‌ అయ్యిందా!.. భక్తులేమంటున్నారు?