Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

వధువు మెడలో మూడుముళ్లు వేసిన వరుడిని గృహంలో బంధించారు...

Advertiesment
Jagityal
, సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (09:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని ఓ పెళ్లింట కలకలం రేగింది. మరికొన్ని క్షణాల్లో వధువు మెడలో మూడుముళ్లు వేసిన వరుడుని గదిలో బంధించారు. ఇలా నిర్బంధించడానికి గల కారణాలను ఆరా తీయగా సదరు వ్యక్తికి ఇదివరకే వివాహమైనట్టు తేలింది. 
 
ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జగిత్యాల జిల్లాలోని పోరండ్ల గ్రామానికి చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఆదివారం వైభవంగా పెళ్లి జరగాల్సివుంది. అయితే, రాజశేఖర్‌తో తనకు గతంలోనే పెళ్లి అయిందంటూ ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరుకు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో వరుడి నిర్వాకం బయటపడింది. దీంతో వధువు బంధువులు...రాజశేఖర్‌ను గదిలో బంధించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరోవైపు ఉట్నూరు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతిలోక సుందరి దివికేగి ఏడాది అయ్యింది.. నా నవ్వులోనే..