Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్‌బాస్-2: హౌస్‌లో సామ్రాట్‌తో క్లోజ్‌.. గీతామాధురిని ప్రశ్నించిన భర్త?

బిగ్ బాస్ సీజన్-2లో భాగంగా గురువారం ఎపిసోడ్‌లో గీతామాధురి భర్త నందు హౌస్‌లోకి వచ్చాడు. సామ్రాట్‌తో సన్నిహితంగా వుండటంపై గీతా దగ్గర మాట్లాడాడు. ఆ విషయాలన్నీ శుక్రవారం ఎపిసోడ్‌లో గీతా దీప్తితో చర్చించిం

బిగ్‌బాస్-2: హౌస్‌లో సామ్రాట్‌తో క్లోజ్‌.. గీతామాధురిని ప్రశ్నించిన భర్త?
, శనివారం, 15 సెప్టెంబరు 2018 (12:26 IST)
బిగ్ బాస్ సీజన్-2లో భాగంగా గురువారం ఎపిసోడ్‌లో గీతామాధురి భర్త నందు హౌస్‌లోకి వచ్చాడు. సామ్రాట్‌తో సన్నిహితంగా వుండటంపై గీతా దగ్గర మాట్లాడాడు. ఆ విషయాలన్నీ శుక్రవారం ఎపిసోడ్‌లో గీతా దీప్తితో చర్చించింది. కౌశల్ తన గురించి అలా మాట్లాడడం వలనే ఇలా జరిగిందా అర్ధం కాలేదని చాలా కన్ఫ్యూజ్ అయ్యానని గీతామాధురి చెప్పింది. 
 
సామ్రాట్‌కి తాను రాఖీ కట్టాను, తాను రాఖీ కడుతుంటే మమ్మా అని పిలుస్తాడు. తాను అందరితో గేమ్ ఆడాను. కానీ సామ్రాట్‌తో ఆడింది మాత్రమే చూపిస్తే తానేం చేయగలనని వెల్లడించింది. రోల్, అమిత్ భయ్యాలతో కూడా పాంపెరింగ్ చేశా.. అమిత్ అయితే తన వేలు తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తే తాను సామ్రాట్‌తో చేసింది చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఇదొక్కటే చూస్తే అలానే కనిపిస్తుంది.
 
అయినా కౌశల్ ఇదొక్కటే ఎలా చూస్తారు. నువ్వు, శ్యామల మాట్లాడింది కూడా అందరినీ ఉద్దేశించే మాట్లాడారు. అయినా గీత చాయిస్ ఎప్పుడు తప్పు కాదని నందుకి తెలుసు. మా క్లారిటీ మాకుంది. కౌశల్ వల్లే ఇదంతా క్రియేట్ అయిందని తన అనుమానమని దీప్తితో చర్చించింది. అర్ధరాత్రి గీతా, దీప్తి, సామ్రాట్‌ల మధ్య మరోసారి కౌశల్ గురించి చర్చ జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీడియాకి షాక్ ఇచ్చిన శైల‌జారెడ్డి అల్లుడు..!