Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసక్తి కలిగించిన రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం టీజర్ : హను రాఘవపూడి

Praveen Kandela, Hanu Raghavapudi, Shrikant Rathod, Jaiyetri Makana
, సోమవారం, 28 నవంబరు 2022 (10:09 IST)
Praveen Kandela, Hanu Raghavapudi, Shrikant Rathod, Jaiyetri Makana
జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం. ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న ఈ చిత్రానికి సంతోష్ మురారికర్ కథ అందించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశారు. టీజర్ చూసిన అనంతరం బాగుందని ప్రశంసించారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
 
రెండు నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. 'నా పేరు కుమార్.. ఇది నా ఊరు.. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు.. కానీ మనం ఆడింది వందే' అంటూ ప్రారంభమైన టీజర్ అందరిలోనూ ఓ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. 'వంద మంది.. బరా బర్ వంద మందిని చూపించాలి'.. 'అన్నా ఇదంతా నిజంగా అయితదా?.. అయితది.. ఏం కావాల్నో అదే అయితది'.. 'ఈ పని ఒక్కడే చేయగలడు సర్.. అయితే ఇదంతా మీకు తెలిసే జరుగుతాందా?' అనే ఈ డైలాగ్స్‌తో సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్పేశారు.
 
అసలు ఏం జరుగుతోంది.. ఆ వంద అబద్దాలు ఏంటి? ఆ వంద మంది కలిసి చేసిన పని ఏంటి?.. తుపాకుల గూడెంలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా సినిమా టీజర్‌ను యూనిట్ కట్ చేసింది. ఈ టీజర్‌లో శ్రీకాంత్ అర్పుల కెమెరాపనితనం అద్భుతంగా కనిపిస్తోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ ఈ సినిమాకు పని చేయడం విశేషం. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. జైదీప్ విష్ణు దర్శకుడు కూడా కావడంతో ఎక్కడ ఎలాంటి కట్స్ కావాలి..ఏ ఏ షాట్స్ ఉండాల్లో తెలుసు. కాబట్టి ఎడిటర్‌గానూ అద్భుతంగా ఈ టీజర్‌ను కట్ చేశారు జై దీప్ విష్ణు.
 
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న థియేటర్లోకి రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊహకందని మలుపులతో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా అధర్వ : డైరెక్టర్ మహేష్‌ రెడ్డి