Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్య కథను ముందుగా సుక్కు ఎవరికి చెప్పాడో తెలుసా?

ఆర్య కథను ముందుగా సుక్కు ఎవరికి చెప్పాడో తెలుసా?
, శుక్రవారం, 8 మే 2020 (16:47 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రం ఆర్య. ఈ చిత్రం ద్వారా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమర్ దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించారు. వన్ సైడ్ లవ్ అంటూ ఆర్య ప్రేమకథా చిత్రాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అటు అల్లు అర్జున్‌కి, ఇటు సుకుమార్‌కి ఇద్దరికీ... ఆర్య మంచి పేరు తీసుకువచ్చింది. 
 
అంతేకాకుండా.. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
 
 అది ఏంటంటే... సుకుమార్ ఆర్య కథను రెడీ చేసిన తర్వాత దిల్ రాజుకి చెబితే.. ఈ సినిమాను తను నిర్మిస్తానని చెప్పారట. ఏ హీరోకి చెబుదామని ఆలోచించి.. సుకుమార్ ఫస్ట్ ప్రభాస్‌కి ఈ కథను చెప్పాడట. కథ విని ప్రభాస్ బాగుందని చెప్పాడట కానీ.. ఎందుకనే ఇంట్రస్ట్ చూపించలేదట. 
 
దీంతో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి చేస్తానన్నాడట సుకుమార్. అయినా.. ప్రభాస్ స్పందించకపోవడంతో ఈ కథను రవితేజకు చెప్పాడట. రవితేజ కూడా ఈ కథపై అంతగా ఆసక్తి చూపించలేదట. ఆ తర్వాత నితిన్‌కి చెబితే.. అక్కడ కూడా సేమ్ రియాక్షన్.
 
 ఆ తర్వాత అల్లు అర్జున్‌కి చెబితే.. వెంటనే ఓకే చెప్పాడట. 4 కోట్లతో రూపొందిన ఈ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసింది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. నిర్మాతకు ఆర్య ఎంతటి లాభాలను అందించిందో.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైతు ఇది నిజమేనా..?