Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓపీ-శశికళ ఇద్దరూ బానిసలే.. అమ్మ ఆత్మ చివరికి ఎవరిని దీవిస్తుందో?: రామ్ గోపాల్ వర్మ

తమిళనాట రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడని నేపథ్యంలో.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నోటికి పనిచెప్పాడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే రామ్ గోపాల్ వర్మ తమిళ రాజకీయాలపై మరోసారి స్ప

ఓపీ-శశికళ ఇద్దరూ బానిసలే.. అమ్మ ఆత్మ చివరికి ఎవరిని దీవిస్తుందో?: రామ్ గోపాల్ వర్మ
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (13:00 IST)
తమిళనాట రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడని నేపథ్యంలో.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నోటికి పనిచెప్పాడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే రామ్ గోపాల్ వర్మ తమిళ రాజకీయాలపై మరోసారి స్పందించాడు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాత రోమన్ సామెత ‘యూ టూ బ్రూటస్?’ గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు. 
 
తమిళ రాజకీయాలపై ట్విట్టర్‌లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. శశికళ, పన్నీర్ సెల్వంలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో పన్నీర్ సెల్వం బానిసలా ఉండేవారని, ఆ విషయాన్ని గుర్తు చేసుకుని శశికళ ఆశ్చర్యపడుతోందని ట్వీట్‌లో పేర్కొన్న రాంగోపాల్ వర్మ అంతకంటే ముందు తానే ఓ బానిసలా ప్రవర్తించిన విషయాన్ని మాత్రం శశికళ మర్చిపోయిందని పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రి సీటు కోసం అటు అమ్మ నెచ్చెలి.. ఇటు అమ్మ వీరవిధేయుడి మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలుపు ఎవరికోనని వర్మ ప్రశ్నించారు. అంతేగాకుండా "జయలలిత ఆత్మ ఏమని ఆలోచిస్తుందో?"అంటూ అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా అమ్మ ఆత్మ చివరికి పన్నీరును దీవిస్తుందా? నెచ్చెలి చిన్నమ్మను దీవిస్తుందా? అని సంశయం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిల్ రాజుకు షాక్ ఇచ్చిన నితిన్... 'కాటమరాయుడు'తో నితిన్ పండగ