Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట.. కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?

భర్తతో కలిసి జీవించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టు ఆశ్రయించిన సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట. దీంతో ఆమెకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తన వదిన పల్లవిని వేధింపులకు గురి చేసిన కేసులో కోర్టుకు హా

సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట.. కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?
, గురువారం, 12 జనవరి 2017 (06:49 IST)
భర్తతో కలిసి జీవించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టు ఆశ్రయించిన సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట. దీంతో ఆమెకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తన వదిన పల్లవిని వేధింపులకు గురి చేసిన కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. 
 
రంభ సోదరుడు శ్రీనివాసరావుకు 1999లో పల్లవితో వివాహం కాగా, తనను భర్త, అత్తమామలు, ఆడపడుచు రంభ వేధించారని 2014 జూలైలో పల్లవి మూడో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో వీరు ముగ్గురిపై ఐపీసీ 498 (ఏ) కింద కేసు నమోదైంది. 
 
అప్పటి నుంచి రంభకు ఎప్పుడు సమన్లు ఇవ్వాలని చూసినా, ఆమె అమెరికాలో ఉంటుండటంతో వీలు కాలేదు. ఇటీవల ఓ టీవీ చానల్ రియాల్టీ షో కోసం ఆమె హైదరాబాద్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు, పద్మాలయా స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో వచ్చి సమన్లు అందించారు. వెంటనే న్యాయస్థానానికి రావాలని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ రిపోర్ట్: బడుగు జాతి కాదు తెలుగు జాతి.. ఇద్దరు చంద్రులకు థ్యాంక్స్ చెప్తూ..?